May 27, 2010

సిగ్గు సిగ్గు

ఈ రోజు వార్తాపత్రిక చదువుతూ ఉంటే "శ్రీ కాళహస్తి రాజ గోపురం" కూలిన వార్త చదివి చాలా బాద పడ్డాను. ఇది ఎంత అవమానం మనకి, మన చరిత్రకే తల మాణికం అయిన ఇలాంటి పురావస్తు కట్టడాలను పరిరక్షించుకోవడం మన భాద్యత కాదంటారా? మరి దానికోసమే నియమించిన అధికారులను ఏమి చెయ్యాలి? ఇక మన మంత్రివర్యులు "గాదె వెంకటరెడ్డి" గారైతే అందులో ఎవరి తప్పిదం లేదని ఎంత నిస్సిగ్గుగా చెపుతున్నారంటే వినడానికే కంపరం పుడుతుంది. మీరేమంటారు? నిజంగా మన అధికారులది తప్పు లేదంటారా?