Jan 4, 2011

2010లో ఏ.సి.బి. దాడులు జరిపి పట్టుకున్న లంచావతారులు మరియు అవినీత్యగ్రేసరులు

ఏ.సి.బి వారి లెక్కల ప్రకారం గడిచిన సంవత్సరంలో పట్టుకున్న మొత్తం కేసులలో రెవిన్యూ శాఖ అవినీతిలో అగ్రగామిగా నిలిచినది. గత సంవత్సరం వారు పట్టుకున్న కేసుల వివరాలు క్లుప్తంగా.

శాఖ కేసులు 
రెవిన్యూ డిపార్టుమెంటు  108
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది 42
మున్సిపల్  పరిపాలన, పట్టాణావృద్ది  35
రవాణా, రోడ్లు మరియు భవనాలు  30
హోం  27
సాంఘీక సంక్షేమం  24
విద్యుత్తు  20
ఆరోగ్య  కుటుంబ  సంక్షేమం  18
విద్య  16
గృహ నిర్మాణం  15

అలాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో మొత్తం 88.28 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. వారికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు
  • 50 లక్షల రూపాయల లోపు ఉన్న కేసులు - పది 
  • 50 లక్షల రూపాయల నుండి ఒక కోటి వరకు ఉన్న కేసులు - నలభై 
  • ఒక కోటి నుండి రెండు కోట్ల వరకు ఉన్న కేసులు - ఇరవై ఐదు
  • నమోదు చేసిన కేసులలో 64.23 శాతం కేసులలో శిక్షలు పడ్డాయి.
  • 44 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం విధులనుండి తప్పించింది
  • నమోదు చేసిన కేసులలో 222 గెజిటెడ్ అధికారులు 230 మంది నాన్ గెజిటెడ్ అధికారులు మరియు 53 మంది కార్పోరేషన్ / ప్రైవేట్ అధికార్లు ఉన్నారు.
          
 అలాగే గత సంవత్సరం మొత్తంమీద 178 ట్రాప్ కేసులు, 81 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మరియు 87 ఆకస్మిక తనిఖీల కేసులు నమోదు చేసారు.

"Good Job A.C.B."

1 comment: